ట్యాక్స్ పేయర్ల అకౌంట్లలోకి రిఫండ్ డబ్బులు

ట్యాక్స్ పేయర్ల అకౌంట్లలోకి రిఫండ్ డబ్బులు

కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు  గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. వారి అకౌంట్లలో డబ్బులు జమ చేసింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT తాజాగా విషయాన్ని తెలిపింది. పన్ను చెల్లింపుదారుల బ్యాంక్ ఖాతాల్లో రిఫండ్ డబ్బులు జమ చేసినట్లు CBDT చెప్పింది. 2021 ఏప్రిల్ 1 నుంచి 2021 ఆగస్ట్ 30 వరకు 23.99 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు రూ.67,401 కోట్ల రిఫండ్ చేశామంది CBDT. ఇందులో కార్పొరేట్ ట్యాక్స్ రిఫండ్స్ మొత్తం రూ.51,029 కోట్లు. అలాగే ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్స్ మొత్తం రూ.16,373 కోట్లు.

ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కొత్త ఇఫైలింగ్ పోర్టల్ తో ట్యాక్స్ పేయర్లు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ పేయర్లకు రిఫండ్ డబ్బులు చెల్లించింది. పోర్టల్ సమస్యతో ఇంకా కొంత మంది పన్ను చెల్లింపుదారులు ఇంకా ITR దాఖలు చేయలేదు. సాధారణంగా ITR దాఖలు చేసిన పది రోజుల్లోనే రిఫండ్ డబ్బులు వచ్చేస్తాయి. అయితే కొన్ని సమస్యల వరకు రిఫండ్ ఆలస్యం కూడా కావొచ్చు. మీకు ఇంకా రిఫండ్ డబ్బులు రాకపోతే ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లోకి వెళ్లి స్టేటస్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది.